PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బేరీజు వేసుకోండి..!

1 min read
జీ.పీ. ఎన్నికలో ప్రచారం చేస్తున్న మాండ్ర శివానందరెడ్డి

జీ.పీ. ఎన్నికలో ప్రచారం చేస్తున్న మాండ్ర శివానందరెడ్డి

– రెండేళ్లయ్యింది.. ఒక్క పనైనా.. చేశారా..!
– టీడీపీ నంద్యాల పార్లమెంట్​ ఇన్​చార్జ్​ మాండ్ర శివానంద రెడ్డి
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది.. నందికొట్కూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో ఒక్క పనైనా చేశారా… అని టీడీపీ నంద్యాల పార్లమెంట్​ ఇన్​చార్జ్​ మాండ్ర శివానంద రెడ్డి ప్రజలను ప్రశ్నించారు. ఎక్కడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని.. అలాంటప్పుడు వైసీపీకి ఓటు ఎందుకు వేయాలో… మీరే ప్రశ్నించాలని సూచించారు. బుధవారం నందికొట్కూరు మండలం అల్లూరు,బిజినవేముల, గ్రామాల్లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తపట్నానికి వచ్చే వంతెనలు, రోడ్డు తెదేపా హయాంలో చేపట్టినవే అన్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల నుంచి గ్రామాలలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఈ నెల 17న జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో తెదేపా మద్దతుదారులను గెలిపించాలని కోరారు. పంచాయతీ ఎన్నికల్లో తెదేపా బలపర్చిన అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడు సర్పంచి అభ్యర్థి చిన్న నాగలక్ష్మయ్య, టిడిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author