PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భక్తిశ్రద్ధలతో.. పడిసేవ

1 min read
గిరిస్వామి నివాసంలో అల్పాహారం తీసుకుంటున్న స్వాములు

గిరిస్వామి నివాసంలో అల్పాహారం తీసుకుంటున్న స్వాములు

పల్లెవెలుగు, ఆదోని
మహాశివరాత్రిని పురస్కరించుకుని మాలధారణగావించిన భక్తులు … భక్తిశ్రద్ధలతో పడిపూజ నిర్వహించారు. ఆదివారం పట్టణంలోని శంకర్​నగర్​లో గిరిస్వామి నివాసంలో గురుస్వాములు శైలేంద్ర స్వామి, నీలకంఠస్వామి, లింగోజి స్వామి ఆధ్వర్యంలో మాలధారులు ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా శివపార్వతుల చిత్రపటానికి పూలతో అందంగా అలంకరించిన శివస్వాములు.. ఆ తరువాత భక్తిపాటలతో పరవశించారు. అనంతరం గురుస్వాములు… దీక్ష యొక్క విశిష్టతను మాలధారులకు వివరించారు. భోళశంకరుడికి ఇష్టమైన గోధుమ రంగు గల వస్ర్తాలను మాత్రమే మాలధారులు ధరించాలన్నారు. తెల్లవారు జామున శిరస్నానం ఆచరించిన స్వాములు…దేవాలయంలో శివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయాలన్నారు. మధ్యాహ్నం సేవ, రాత్రి పడిసేవ చేస్తూ… స్వామిని మదిలో తలచుకుంటూ నిద్రపోవాలన్నారు.

About Author