PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళలకు సమాన హక్కు కల్పించాలి

1 min read
కేక్​ కట్​ చేస్తున్న ఎన్​డబ్ల్యూపీ జిల్లా అధ్యక్షురాలు హసీనాబేగం

కేక్​ కట్​ చేస్తున్న ఎన్​డబ్ల్యూపీ జిల్లా అధ్యక్షురాలు హసీనాబేగం

– ఎన్​డబ్య్లూపీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు హసీనాబేగం
పల్లెవెలుగు, కర్నూలు;
చట్టసభలో మహిళలకు సమాన హక్కులు కల్పించాలని ఎన్​డబ్య్లూపీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు హసీనాబేగం
డిమాండ్​ చేశారు. శనివారం జాతీయ మహిళా స్థానిక పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్​. హసీనాబేగం మాట్లాడుతూ సృష్టిలో గొప్పది ఏదైనా ఉందంటే … అది మహిళేనని, అలాంటి మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. మహిళలకు జరుగుతున్న దాడులు నియంత్రించాలంటే.. పార్లమెంటులో మహిళలకు 50శాతం రిజర్వేషన్​ కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఉమెన్​స పార్టీ ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ ఎన్. మేరీ, ఉమెన్స్ వింగ్ జనరల్ సెక్రెటరీ కృష్ణవేణి, ఎస్.సుజాత, టీ. విజయమ్మ, భార్గవి సుజాత, ప్రతిభ కుమారి, శంకరమ్మ, స్రవంతి, సునీత బాయ్, మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author