PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాజీ మేయర్​.. వైసీపీలోకి..

1 min read
వైసీపీ ఖండువా కప్పుకున్న బంగి అనంతయ్య

వైసీపీ ఖండువా కప్పుకున్న బంగి అనంతయ్య

బంగి అనంతయ్యకు ఖండువా కప్పిన ఎమ్మెల్యే
పల్లెవెలుగు, కర్నూలు
రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని కాంక్షించే వారు.. వైసీపీలో చేరుతున్నారని కర్నూలు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​ అన్నారు. 15వ వార్డు ఇన్​చార్జ్​ కేదార్​నాథ్​ ఆధ్వర్యంలో మాజీ మేయర్​, సీనియర్​ నాయకులు బంగి అనంతయ్య వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం వార్డు పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​ .. బంగి అనంతయ్యకు ఖండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్​, సీనియర్​ నాయకులు బంగి అనంతయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కార్యాచరణ ఎంతగానో ఆకట్టుకుందన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని సంక్షేమ పథకాలు.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేశారని కొనియాడారు. కోవిడ్ సమయంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ శాసనసభ్యులు చేయని పని మన కర్నూల్ శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ చేశారని తెలిపారు. బంగి అనంతయ్యతోపాటు లక్ష్మయ్య సురేష్, రవిశంకర్, గణేష్, రఘు రాణా ప్రతాప్ శంకర్, చిరంజీవి మరియు అనుచరులు 100 మందితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

About Author