NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లోక కళ్యాణార్థం…

1 min read
సూర్యదేవాలయంలో హోమం నిర్వహిస్తున్న అర్చకులు, భక్తులు

సూర్యదేవాలయంలో హోమం నిర్వహిస్తున్న అర్చకులు, భక్తులు

పల్లెవెలుగు, కర్నూలు
నగరంలోని సూర్యదేవాలయం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు, అభిషేకాలు చేశారు. మహాగౌరి అమ్మవారి రాజశ్యామల నవరాత్రుల ముగింపు సందర్భంగా ఆదివారం సహస్రనామార్చనలు, రాజశ్యామల హోమం నిర్వహించారు. ప్రజలు ఆయురారోగ్యాలతో..సుఖసంతోషాలతో ఉండాలన్న సదుద్దేశంతో అమ్మవారి శాలలో హోమం, ప్రత్యేక పూజలు చేసినట్లు అర్చకులు లక్ష్మినరసింహ శర్మ, వినయ్​ కుమార్​ శర్మ, ఆలయ ట్రస్టు చైర్మన్​ రామకృష్ణ తెలిపారు.

About Author