PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వంద రూపాయ‌ల లాట‌రీ టికెట్టుకు కోటి రూపాయ‌ల లాట‌రీ సొంత‌మైంది ఓ మ‌హిళ‌కు. అమ్రుత్ స‌ర్ కు చెందిన రేణూ చౌహ‌న్ అనే మ‌హిళ‌కు న‌డిమంత్రపు సిరి క‌లిసొచ్చింది. వంద‌రూపాయ‌లు పెట్టి లాట‌రీ కొంటే… ఏకంగా కోటిరూపాయ‌లు గెలుచుకుంది. భ‌గ‌వంతుడి ఆశిస్సుల వ‌ల్లే తాను ఈ లాట‌రీ గెలిచిన‌ట్టు ఆమె చెప్పారు. అమ్రుత‌స‌ర్ లోని బట్టల దుకాణం న‌డిపే ఆమెకు కోటి రూపాయ‌ల లాట‌రీ సొంత‌మైన‌ట్టు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ డ‌బ్బును ఆమె బ్యాంక్ అకౌంట్ లో జ‌మ చేయ‌నున్నట్టు సంబంధిత శాఖ తెలిపింది. అయితే.. ఈ డ‌బ్బుతో త‌న జీవితం సాఫీగా సాగిపోతోందంటూ చెప్పుకొచ్చారు ఆ లాట‌రీ విన్నర్​.

About Author