PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శివ‌కాశిలో పేలుడు

1 min read

– ఆరుగురి దుర్మరణం
– 14 మందికి గాయాలు
తమిళనాడు; త‌మిళ‌నాడులోని శివ‌కాశిలో ఘోర ప్రమాదం జ‌రిగింది. ట‌పాసుల త‌యారీ కేంద్రంలో పేలుడు సంభ‌వించ‌డంతో ఆరుగురి దుర్మరణం చెందారు. మ‌రో 14 మందికి గాయాలైన‌ట్టు స‌మాచారం. క్షతగాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. విరుదున‌గ‌ర్ జిల్లా శివకాశిలోని ఓ ట‌పాసుల త‌యారీ కేంద్రంలో ఫ్యాన్సీ ట‌పాసులు త‌యారు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఈ ఘటన జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. వెను వెంట‌నే పేలుడు సంభ‌విచండంతో ఆ బిల్డింగ్ లోని ప‌ది గ‌దులు నేల‌మ‌ట్టమైన‌ట్టు స‌మాచారం. అయితే..పేలుడు ధాటికి కూలీలను గుర్తుపట్టలేని ప‌రిస్థితి ఉందని స్థానికులు తెలిపారు. ఆస్పత్రికి త‌ర‌లించిన వారిలో ఇద్దరి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని స‌మాచారం.

About Author