NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

1 కోటి 17 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : మండల కేంద్రం మద్దికెరలో     1 కోటి 17 లక్షలతో జరిగిన అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి శనివారం నాడు ప్రారంభించారు. రూ 43.40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయం-4,రూ 23.94 లక్షలతో వైఎస్ఆర్ రైతు భరోసా సెంటర్ -4, గడప – గడప కు మన ప్రభుత్వం  నిధుల క్రింద 50 లక్షలతో పూర్తయిన సీసీ రోడ్లను పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి  ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం మద్దికెర ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లో ప్రధానమంత్రి జన ఔషధీ ను(మెడికల్ షాప్) సొసైటీ ప్రెసిడెంట్ శాంతన్న తో కలసి ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ, కర్నూలు జిల్లా కేడిసిసి బ్యాంక్ చైర్ పర్సన్ ఎస్వి విజయ మనోహరి  కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఈవో, డిసిఓ మరియు  పంచాయతీరాజ్ అధికారులు, వ్యవసాయ అధికారులు,సచివాలయం సిబ్బంది, మండల సర్పంచులు,ఎంపీటీసీ సభ్యులు,మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author