PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి సభ్యత్వం ఉన్న ప్రతిఒక్కరికీ 10లక్షల ఉచిత భీమా

1 min read

– కమలాపురంలో గెలుపు గుర్రానికే టిక్కెట్ ఇవ్వాలి

– ఆహ్వానిస్తే టిడిపి రాకదలిరా సభకు హాజరవుతా

– టిడిపి గెలుపు కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తా

– టిక్కెట్ ప్రకటించిన తరువాత ఇంఛార్జ్ పై మాట్లాడతా

– టిడిపి రాష్ట్ర మాజీ కార్యదర్శి సాయినాథ్ శర్మ

పల్లెవెలుగు వెబ్ కమలాపురం : కమలాపురం  నియోజకవర్గంలో టిడిపి సభ్యత్వం కలిగి పార్టీని అమ్ముకున్న వారికి కాకుండా పార్టీని నమ్ముకున్న ప్రతీ ఒక్కరికీ ఉచితంగా 10లక్షల ఉచిత భీమా తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్నానని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని టిడిపి రాష్ట్ర మాజీ కార్యదర్శి సాయినాథ్ శర్మ పిలుపునిచ్చారు. 

మీడియా సమావేశంలో మాట్లాడుతూ…

కమలాపురంలో టిడిపి అధిష్టానం గెలిచే గెలుపు గుర్రానికే టిక్కెట్ ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా కమలాపురం నియోజకవర్గంలో టిడిపి అధిష్టానం పార్టీ కోసం పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉన్న నాయకునికి టిక్కెట్ కేటాయిస్తే వారి గెలుపు కోసం పూర్తిస్థాయిలో తాను తన అనుచరులు పని చేస్తామన్నారు.  ఈ నెల 19వ తేదీన కమలాపురంలో నిర్వహించే రా.. కదలిరా బహిరంగ సభకు సమాచారమిచ్చి ఆహ్వానిస్తే ఖచ్చితంగా హాజరవుతానన్నారు. ప్రస్తుత టిడిపి ఇంఛార్జ్ గురించి టిడిపి అధిష్టానం టిక్కెట్లు కేటాయించిన తరువాత మాట్లాడతానన్నారు.

About Author