PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

10 ల‌క్ష‌ల ఉద్యోగాలు టార్గెట్ !

1 min read

పల్లెవెలుగు వెబ్​ : ప్ర‌ముఖ ఐఫోన్ల త‌యారీ సంస్థ యాపిల్‌ దేశీయంగా విస్తరణను చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు భారీగా పెట్టుబ‌డులు పెట్ట‌నున్న‌ట్టు కంపెనీ ప్రొడక్ట్‌ కార్యకలాపాల వైస్‌ప్రెసిడెంట్‌ ప్రియ బాలసుబ్రమణ్యన్‌ పేర్కొన్నారు. ఉద్యోగులు, యాప్స్, సరఫరా భాగస్వాములు ద్వారా 10 లక్షల ఉద్యోగాల క‌ల్ప‌న‌కు కృషి చేయ‌నున్న‌ట్టు 2021 బెంగళూరు టెక్‌ సదస్సు సందర్భంగా తెలియజేశారు. రెండు దశాబ్దాలుగా యాపిల్  దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. 2017లో బెంగళూరు యూనిట్‌లో ఐఫోన్ల తయారీని చేపట్టినట్లు తెలిపారు.  చెన్నైలోనూ తయారీ కార్యకలాపాలను విస్తరించినట్లు పేర్కొన్నారు. తద్వారా వివిధ ఐఫోన్‌ మోడళ్లను దేశ, విదేశీ మార్కెట్ల కోసం రూపొందిస్తున్నట్లు వివరించారు. త‌యారీ పెంచ‌డం ద్వార కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామ‌ని ఆమె తెలిపారు.

About Author