PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీఎస్పీకి 10 పార్టీల మద్దతు

1 min read

పల్లెవెలుగువెబ్ : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీకి పది పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ మేరకు బీఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రా పలు పార్టీల నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీఎస్పీకి తాము బేషరతుగా మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపాయి. ఈ విషయాన్ని సతీష్ చంద్ర మిశ్రా అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వార వెల్లడించారు.‘‘గౌరవనీయ మాయావతి అభివృద్ధికి ప్రేరేపితులై 10 రాజకీయ పార్టీల నేతలు బహుజన్ సమాజ్ పార్టీకి తమ భేషరతు మద్దతు ప్రకటించారు. అలాగే ‘సర్వజన హితాయ.. సర్వజన సుఖాయ’యొక్క కార్యరూపాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సంకల్పం తీసుకున్నారు’’అని సతీష్ చంద్ర మిశ్రా ట్వీట్ చేశారు.

         

About Author