NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

10వేల రూ. ఆర్థిక సాయం..

1 min read

పల్లెవెలుగు, వెబ్​ చింతలపూడి : ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల సంఘం పశ్చిమ గోదావరి జిల్లా,ఏలూరు జిల్లా అధ్యక్షులు డి వేణుగోపాలస్వామి చింతలపూడి ఫైర్ డిపార్ట్మెంట్ యందు ఆపరేటర్ డ్రైవర్ అయిన గొల్ల భద్ర రావు చింతలపూడి ఫైర్ స్టేషన్ నందు విధులులో ఉండగా గుండెపోటుతో మరణించారు.ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ,ప్రభుత్వ వాహనముల డ్రైవర్లను సంఘం తరఫున,పదివేల రూపాయలు ఆర్థిక సహాయం వారి కుటుంబ సభ్యులకు అందజేయమైనది.ఉమ్మడి జిల్లాలలో ఎవరైనా ఉద్యోగి ఏ ప్రభుత్వ డ్రైవర్ల సంఘ ఉద్యోగులైతే వారికి తక్షణ సహాయార్థం కొంత నగదును అందజేస్తామని. వారి ఆర్థిక స్థితిగతులు దృష్టిలో ఉంచుకొని తదుపరి చర్యలు సంఘం నిర్ణయం మేరకు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దత్తి.వేణుగోపాలస్వామి. ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల సంఘము.ఎస్ ఎన్ వి శ్రీనివాస్.ట్రెజరర్ కె నాగబాబు,ఏలూరు డివిజన్ అధ్యక్షులు.ఫైర్ ఆపరేటర్ డ్రైవర్ ఐ ఎన్ వి శ్యామ్ కుమార్,కె నరసింహారావు,మొదలగు వారు పాల్గొన్నారు.

About Author