NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైయస్సార్ బీమా ద్వారా 10వేలు అందజేత 

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: చెన్నూరు సరస్వతి నగర్ లో నివాసం ఉంటున్న చింతల రాజ్య అనే వ్యక్తి ఇటీవల గుండె నొప్పితో మృతి చెందడం జరిగింది, దీంతో మృతుని కుటుంబ సభ్యులకు వైయస్సార్ బీమా పథకం ద్వారా తక్షణ సహాయం కింద పదివేల రూపాయలు అతని కుటుంబానికి శుక్రవారం అందివ్వడం జరిగింది, అలాగే రావలసిన లక్ష రూపాయలు ఆర్థిక సహాయం వారి కుటుంబానికి త్వరలోనే అందివ్వడం జరుగుతుందని, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ అన్నారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిద్ధివెంకటసుబ్బయ్య వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు పేరు సోమల మునయ్య , అన్నమయ్య, యువ నాయకులు సాయి పవన్ కుమార్ రెడ్డి(పండు) సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

About Author