PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మృతురాలి కుటుంబ సభ్యులకు 10 వేల. రూ ఆర్థిక సాయం

1 min read

– ఆధర్యపడవద్దు టిడిపి పార్టీ అండగా ఉంటుంది.. సైదు గోవర్ధన్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రు గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త సైదు.ఏడు కొండలు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ కొల్లేరు ప్రాంత నాయకుడు సైదు.గోవర్ధన్ కొండంత అండగా నిలిచారు.పార్టీ కార్యకర్త ఏడుకొండలు భార్య సైదు.దుర్గమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.ఈక్రమంలో శుక్రవారం ఉదయం  ఏడుకొండలు కుటుంబాన్ని గోవర్ధన్ పరామర్శించి,10 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు. ఏడుకొండలు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.కుటుంబానికి పార్టీ అన్ని విధాల అండదండగా ఉంటుందని భరోసానిచ్చారు.ఈసందర్భంగా గోవర్ధన్ మాట్లాడుతూ కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసునని, కొల్లేరు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.గత కొన్ని సంవత్సరాల నుంచి అటు పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటూనే నిరుపేదలైన కొల్లేరు ప్రాంత వాసులకు పెళ్లిళ్ల సమయంలో ఆర్థిక సహాయం చేస్తున్నట్లు తెలిపారు.

About Author