NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆ రెండు ప‌త్రిక‌ల పై రూ.. 100 కోట్ల దావా.. కోర్టుకు నారా లోకేష్‌

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : విశాఖ కోర్టుకు హాజరైన టీడీపీ నేత నారా లోకేష్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను అనని మాటలను అన్నానని ప్రచురించారన్నారు. తనపై తప్పుడు వార్తలను ప్రచురించారన్నారు. సాక్షితో పాటు మరో రెండు పత్రికలకు నోటీసులిచ్చామన్నారు. తప్పు జరిగిందని తనకు లేఖలు కూడా రాశారన్నారు. సాక్షిపై 75 కోట్లు, డెక్కన్ క్రానికల్‌పై 25కోట్ల దావా వేశారు. తనపై అసత్యాలు ప్రచురించారని సాక్షి పత్రికపై లోకేష్ పిటిషన్ దాఖలు చేశారు. కేసుకు సంబంధించి ఈనెల 24న కోర్టుకు హాజరయ్యారు. ఇవాళ్టికి కేసు వాయిదా పడడంతో లోకేష్ మరోసారి కోర్టుకు హాజయ్యారు.

                             

About Author