NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

108 వాహనంలో ప్రసవం….తల్లి బిడ్డ క్షేమం..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : 108 అంబులెన్స్ లో  గర్భిణి పండంటి మగ బిడ్డ జన్మనిచ్చిన ఘటన సోమవారం గడివేముల మండలంలో చోటుచేసుకుంది. అంబులెన్స్ సిబ్బంది తెలిపిన వివరాల మేరకు. బిలకల గూడూరు గ్రామానికి చెందిన   షేక్ రేష్మ (27) కి పూర్తి  నెలలు నిండాయి, మూడవ కాన్పు  క్రమంలో సోమవారం మధ్యాహ్నం పురిటి నొప్పులు వచ్చాయి. ,అందుబాటులో ఎలాంటి వాహనాలు లేకపోవడంతో గర్భిణీ కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. దీంతో  అందుబాటులో ఉన్న 108 వాహనం  బిలకల గూడూరు గ్రామంలో గర్భిణీ ఇంటికి 108 వాహనంతో చేరుకున్న సిబ్బంది గర్భిణిని ఆసుపత్రికి తరలించారు. మూడవ కాన్పు కావడంతో గడివేముల పీహెచ్ సిబ్బంది మిడుతూర్ పిహెచ్సికి ప్రిఫర్ చేశారు. మిడుతూర్ కు తరలిస్తున్న క్రమంలో మార్గం మద్యలో పురిటి నొప్పులు అధికంగా అయ్యాయి.దీంతో మార్గం మధ్యలో అంబులెన్స్ ఆపి పైలెట్ రమేష్ ఇఏంటి నయోమి గర్భిణీ కుటుంబ సభ్యుల సహకారంతో అంబులెన్స్ లోనే  ప్రసవం చేశారు. దీంతో గర్భిణీ రేష్మ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. మార్గం మధ్యలో ఉన్న తలముడిపి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తల్లి బిడ్డను చేర్పించారు. అక్కడి వైద్యులు తల్లి బిడ్డను పరీక్షించి తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. సమయస్ఫూర్తితో గర్భిణీకి నార్మల్ డెలివరీ చేసిన 108 ఈఎంటి నయోమి ను పైలట్ రమేష్ లను గర్భిణీ కుటుంబ సభ్యులు, వైద్య సిబ్బంది అభినందించారు.

About Author