PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు

1 min read

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల : మండల కేంద్రమైన గోనెగండ్ల లో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు శనివారం ముగిశాయి. మండలంలోని పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పదవ తరగతి పరీక్ష కేంద్రాలను స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రం ఏ, పరీక్ష కేంద్రం బి, కేజీబీవీ పాఠశాలలో మరియు మండల పరిషత్ పాఠశాల బస్టాండ్ స్కూల్ నందు నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు ముగిశాయని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎగ్జామ్ చీఫ్ కృష్ణయ్య ,పరీక్షా కేంద్రం బి ఎగ్జామ్ చీఫ్ పరమేశ్వర్ రెడ్డి కేజీబీవీ పాఠశాల నందు ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రం ఎగ్జామ్స్ చీఫ్ ముజాహిద్దీన్ భాష,అలాగే మండల పరిషత్ (బస్టాండ్ స్కూల్)పాఠశాల యందు ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రం ఎగ్జామ్ చీఫ్ రామలింగప్ప లు తెలిపారు.ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విద్యార్థులకు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రధమ చికిత్స కేంద్రం ఏర్పాటు చేశారు. అలాగే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్సై తిమ్మారెడ్డి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. చుట్టుపక్కల ఎవరైనా సంచరించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షాల కేంద్రాల వద్ద ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగాయి.

About Author