PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాగా వేసి… పట్టుకుని…

1 min read
ముద్దాయి, మద్యం సీసాలను పట్టుకున్న సెబ్​ పోలీసులు

ముద్దాయి, మద్యం సీసాలను పట్టుకున్న సెబ్​ పోలీసులు

11 బాక్సుల మద్యం స్వాధీనం, కారు సీజ్​
పల్లెవెలుగు, కర్నూలు: తెలంగాణ మద్యం సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో కర్నూలు సెబ్​ స్టేషన్​ పోలీసులు పాగా వేసి పట్టున్నారు. వివరాలిలా ఉన్నాయి. అక్రమ మద్యం సరఫరా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో శనివారం సెబ్​ సీఐ రాజశేఖర్ గౌడ్ నేతృత్వంలో ఎస్​ఐ, సిబ్బంది స్థానిక కృష్ణానగర్​లో ఏపీ 21 ఏవై 2049 నెంబరు గల డిజైర్​ కారును తనిఖీ చేయగా… అందులో 5 బాక్సులలో 240(180 ml)మెక్ డొవెల్ విస్కీ మద్యం సీసాలు,2 బాక్సులలో 96(180 ml) రాయల్ స్టాగ్ విస్కీ మద్యం సీసాలు ,2 బాక్సులలో 96(180 ml) ఒరిజినల్ ఛాయిస్ విస్కీ మద్యం సీసాలు, ఒక బాక్సులో 12(750 ml) మాన్షన్ హౌజ్​,ఒక బాక్సులో 12(750 ml) బ్లెండర్స్ ప్రైడ్ మద్యం సీసాలు. మొత్తం 11 బాక్సులలో 456 మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించారు. నందికొట్కూరు మండలం బొల్లవరం గ్రామానికి చెందిన రొక్కం చైతన్య కుమార్​ రెడ్డి అనే వ్యక్తి తన డిజైర్​ కారు ( AP 21AY 2049 )లో మద్యం సీసాలు ఉండటంతో… అతన్ని అరెస్టుచేసి.. కారును సీజ్​ చేసినట్లు సీఐ రాజశేఖర్ గౌడ్ వెల్లడించారు. ఈ దాడులలో ఎస్సై స్వామినాథన్ సిబ్బంది నరసింహులు, నరసింహారెడ్డి,మల్లికార్జున, పీరా, షేక్ షా వలి పాల్గొన్నారు.

About Author