PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్మీకి 117 ఎకరాల భూమి.. వార్త పై క్లారిటీ ఇచ్చిన సుమన్

1 min read

పల్లెవెలుగువెబ్ : ఇండియన్ ఆర్మీకి హీరో సుమన్ 117 ఎకరాల భూమిని ఇచ్చారని ఇటీవల సోషల్ మీడియాలో ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది. అయితే ఈ వార్తలపై తాజాగా సుమన్ వివరణ ఇచ్చారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. ‘‘సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నటువంటి వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. వాటిని నమ్మవద్దు. ఆ భూమికి సంబంధించి వివాదం కోర్టులో కొనసాగుతోంది. ఈ వివాదానికి సంబంధించిన పరిష్కారం లభించిన వెంటనే.. స్వయంగా నేనే అందరికీ తెలియజేస్తాను. దానికి సంబంధించి ఏ విషయమైనా నేనే చెబుతాను. దయచేసి అప్పటి వరకు ఇటువంటి వార్తలను నమ్మవద్దు..’’ అని తెలిపారు.

          

About Author