PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

11వ తేదీ సిద్ధార్థ క్వీస్ట్ స్కూల్ లో చెస్ టోర్నమెంట్

1 min read

పోటీల్లో పాల్గొనున్న పలు జిల్లాల క్రీడాకారులు

బ్రోచర్ విడుదల చేసిన కార్పొరేటర్ ఇ శ్రీదేవి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏపీ రాష్ట్ర చెస్ అసోసియేషన్ మరియు జిల్లా  అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎజిసిఏ, ఎంకెపిజె అకాడమీ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర రాపిడ్ చెస్ టోర్నమెంట్ స్థానిక వట్లూరులోని సిద్ధార్థ క్విస్ట్ స్కూల్లో ఈనెల 11వ తేదీ గురువారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6  గంటల వరకు జరుగుతాయని నిర్వాహకులు జి యోహాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టోర్నమెంట్ లో ఓపెన్ 10 బహుమతులు సాధించినవారు. భీమవరంలో జరిగే అంతర్జాతీయ టోర్నమెంటుకు ఎంపిక అవుతారు మరియు అండర్ 7, అండర్ 9, అండర్ 11, అండర్ 12 ,అండర్ 13, అండర్ 15, ప్రతి ఏజ్ గ్రూపులో 10 బహుమతులు ఇస్తారని తెలిపారు. ఈ టోర్నమెంట్ బ్రోచర్ ను  7వ డివిజన్ కార్పొరేటర్ ఈడుపుగంటి శ్రీదేవి, స్కూల్ సిబ్బంది విడుదల చేశారన్నారు. ఆమె ఈ టోర్నమెంట్ కు అన్ని విధాలా సహకరిస్తామన్నారు. ఈ టోర్నమెంట్ లో అన్ని జిల్లాల క్రీడాకారులు పాల్గొంటారన్నరు. కార్యక్రమంలో జి యోహాన్, మహేష్ లు పాల్గొన్నారు.

About Author