PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేటితో 11వ వారం.. గ్రీవెన్ సెల్ అర్జీదారులకు అన్నదానం

1 min read

– ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పదకొండవ వారం కొనసాగిన జిల్లా, ప్రజలకు ఉచిత అన్నదానం…
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి : ప్రతి సోమవారం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని జిల్లా కలెక్టరేట్, ఎస్ పి కార్యాలయాలకు వచ్చే గ్రీవెన్ సెల్ అర్జీదారులు, ప్రజలకు ఎం ఎల్ ఏ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన అన్నదాన కార్యక్రమం నేటితో పదకొండవ వారానికి చేరుకుంది. ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి సౌజణ్యంతో ఈ సోమవారం నాడు జిల్లా కలెక్టరేట్, ఎస్ పి కార్యాలయా లకు గ్రీవెన్ సెల్ నిమిత్తం వచ్చిన అర్జీ దారులు, ప్రజలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.వారం వారం ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో దాతల సౌజన్యంతో గ్రీవెన్ సెల్ రోజున జిల్లావ్యాప్తంగా వచ్చే ప్రజలకు రుచికరమైన ,నాణ్యమైన భోజనాన్ని ఉచితంగా అందిస్తుండడం హర్షణీయం, ఆదర్శనీయమంటూ జిల్లా వ్యాప్తంగా ప్రజలు అభిననంది స్తున్నారు.భోజనం తిన్నవారందరూ ఆహా ఏమి రుచి అంటుండడం విశేషం.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష,మదనపల్లె పరిశీలకులు హాబీబుల్లా ఖాన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తబ్రేజ్ ఖాన్, సుగవాసి ఈశ్వర్ ప్రసాద్, గౌస్ ఖాన్, ఇర్ఫాన్, సుగవాసి శ్యామ్,టూరిజం జిల్లాసభ్యుడు కొత్తిమీర ప్రసాద్, జావీద్, అమీర్ తదితరులు పాల్గొన్నారు.

About Author