NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సిఐటియు ఆధ్వర్యంలో 137 వ మేడే ఉత్సవాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ పాణ్యం: మండల కేంద్రమైన పాణ్యం లో సోమవారం నాడు ఘనంగా 137 వ ,మే డే ,సందర్భంగా పాణ్యం గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర ,బస్టాండ్ నందు, ఆటో యూనియన్ ఆధ్వర్యంలో, బస్టాండ్ హామాలి యూనియన్ దగ్గర, సిఐటియు, ఆధ్వర్యంలో ,జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు, కే భాస్కర్ ,వెంకట్ శ్రీనివాసరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు బత్తిని ప్రతాప్, మాట్లాడుతూ దేశ సంపదను ఆదాని అంబానీలకు అప్పగిస్తూ కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు మోడీ ప్రభుత్వం విధానాలపై ఐక్య ఉద్యమాలు చేపడతామని అన్నారు కార్మికుల హక్కులు చట్టాలు అమలు కోసం మే డే స్ఫూర్తితో ఉద్యమించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆటో, అమాలి ,గ్రామపంచాయతీ ,స్వచ్ఛభారత్ కార్మికులు ,సుబ్బరాయుడు ,నాగరాజు, బషీర్ భూపాల్ ,చంద్ర ,శ్రీరాములు, శ్యామల దేవదానం ,తదితరులు పాల్గొన్నారు.

About Author