PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆత్మ‌కూరు బ‌రిలో 14 మంది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ గురువారంతో ముగిసిందని రిటర్నింగ్‌ అధికారి, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ హరీందర ప్రసాద్‌ తెలిపారు. ఆత్మకూరులో ఇన్‌చార్జ్‌ ఆర్డీవో బాపిరెడ్డితో కలసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికకు మొత్తం 28 నామినేషన్లు దాఖలయ్యాయని.. వివిధ సాంకేతిక కారణాలతో 13 నామినేషన్లను తిరస్కరించినట్లు చెప్పారు. స్వతంత్ర అభ్యర్థి ఒకరు గురువారం నామినేషన్‌ ఉపసంహరించుకున్నారని తెలిపారు. మిగిలిన 14 మంది ఉప ఎన్నిక బరిలో నిలిచారని చెప్పారు.

                                         

About Author