PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌రోన‌తో 17 మంది టీచ‌ర్లు మృతి.. ఎన్నిక‌ల‌ విధుల్లో పాల్గొని ..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : తెలంగాణ రాష్ట్రంలో ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల విధుల్లో పాల్గొని 17 మంది ఉపాధ్యాయులు, ఇద్దరు జూనియ‌ర్ క‌ళాశాల అధ్యాప‌కులు క‌రోనాతో మృతి చెందార‌ని రాష్ట్ర విద్యాశాఖ అఫిడ‌విట్ లో పేర్కొంది. ఈ మేర‌కు విద్యాశాఖ అధికారులు హైకోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేశారు. ఎన్నిక‌ల విధుల్లో ఉండ‌గా వారికి క‌రోన సోకిన‌ట్టు శాస్త్రీయ‌మైన ఆధారాలులేవంటూ విద్యాశాఖ అధికారులు అఫిడ‌విట్ లో పేర్కొన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక‌తో పాటు , ఖమ్మం, వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్లకు ఎన్నిక‌లు జ‌రిగాయి. విధుల్లో 9737 మంది ఉపాధ్యాయులు, 185 మంది అధ్యాప‌క‌లు పాల్గొన్నారు. వీరిలో 17 మంది ఉపాధ్యాయులు క‌రోన బార‌న‌ప‌డి మ‌ర‌ణించార‌ని, వీరికి అందాల్సిన స‌హాయాన్ని య‌ద్ధ ప్రాతిప‌దిక‌న అంద‌జేస్తామ‌ని ప్రభుత్వం స్పష్టం చేసింది.

About Author