PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

18.48 ల‌క్ష‌ల మందికి.. 703 కోట్లు జ‌మ చేయ‌నున్న ఏపీ ప్ర‌భుత్వం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : స‌ంక్షేమ ప‌థ‌కాలు అందనివారికి ఏపీ ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. రాష్ట్రంలో 18.48 ల‌క్ష‌ల మందికి 703 కోట్ల రూపాయ‌లు మంగ‌ళ‌వారం జ‌మ‌చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యం నుంచి మంగ‌ళ‌వారం ల‌బ్ధిదారుల ఖాతాల్లో సీఎం జ‌గ‌న్ న‌గదు జ‌మచేయ‌నున్నారు. అర్హులై ఉండి ఏ కార‌ణం చేత‌నైనా ల‌బ్ధిపొంద‌ని వారికి ల‌బ్ధిచేకూర్చ‌నున్నారు. సంక్షేమ ప‌థ‌కాలు అంద‌ని వారికి ఏటా జూన్, డిసెంబ‌ర్ లో ల‌బ్ధి చేకూర్చనున్నారు.

                                  

About Author