PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

19 మంది ఎంపీలు స‌స్పెండ్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రాజ్యసభ సమావేశాలకు ఆటంకం కలిగిస్తున్న 19 మంది ప్రతిపక్ష ఎంపీలు వారంపాటు సస్పెండ్ అయ్యారు. సభ సజావుగా సాగకుండా నిరసనలు, ఆందోళనలతో అడ్డుపడుతున్నారనే కారణంతో రాజ్యసభ చైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ అయిన తర్వాత కూడా ఎంపీలు సభను వీడక నిరసన తెలుపుతుండడంతో సమావేశాలను గంటపాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయంపై రాజ్యసభ నాయకుడు, మంత్రి పీయూష్ గోయెల్ స్పందించారు. ప్రతిపక్షాల ఎంపీలను సస్పెండ్ చేయాల్సి వచ్చిందని, భారమైన హృదయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

                                               

About Author