PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

2.35 లక్షల పోస్టులు భర్తీ చేయాలి :వంకిరి రామచంద్రుడు

1 min read

పల్లెవెలుగు వెబ్​: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్​ చేశారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి,యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంకిరి.రామచంద్రుడు జిల్లా వర్కింగ్. శుక్రవారం నంద్యాల జిల్లా కోవెలకుంట్లలోని  బొమ్మిడలా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు,నిరుద్యోగులతో కలిసి సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా వంకిరి రామచంద్రడుతోపాటు ప్రెసిడెంట్ షేక్.రియాజ్ కోవెలకుంట్ల విద్యార్థి నాయకుడు మాబు  మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలో ఖాళీగా ఉన్న రెండు లక్షల 35 వేల పోస్టులను భర్తీ చేయాలని, ఉద్యోగస్తుల వయోపరిమితి వయసు 60 కి తగ్గించాలని రాష్ట్రవ్యాప్తంగా కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఇంటిని, తల్లిదండ్రులను వదిలి పట్టణ ప్రాంతంలో అద్దెకుంటూ కోచింగ్ తీసుకుంటున్నారని,వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోతే  రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులతో నిరుద్యోగులతో కలుపుకొని ఆందోళనకు సిద్ధం అవుతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాజు,నగేష్,ప్రియ,జ్యోతి నిరుద్యోగ యువతి యువకులు పాల్గొన్నారు.

About Author