PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కానిస్టేబుల్ కుటుంబానికి 2000 బ్యాచ్ పోలీసుల చేయూత

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  తోటి బ్యాచ్ (2000 బ్యాచ్) పోలీసులు స్పందించి ఆదుకోవడం అభినందనీయం జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్  3 లక్షల 45 వేల నగదు బాధిత కుటుంబానికి అందజేత. 2000 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్  ఎమ్. తిరుమలేశ్వర రెడ్డి ( పిసి 2258 )  కర్నూలు  ట్రాఫిక్  పోలీసుస్టేషన్ లో పని చేస్తూ 2023 నవంబర్ 9 న అనారోగ్యముతో మృతి చెందారు. ఈయనకు ఒక కుమార్తె  ఉన్నారు. ఈ సంధర్బంగా తమ తోటి కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించి అండగా నిలిచి ఆదుకునేందుకు  2000 బ్యాచ్ చెందిన కర్నూలు , చిత్తూరు ఉమ్మడి జిల్లాల పోలీసులు తమ వంతు సహాయంగా సేకరించిన మొత్తం రూ. 3 లక్షల 45 వేల నగదును గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ జి.కృష్ణకాంత్ ఐపియస్  చేతుల మీదుగా కానిస్టేబుల్ కుమార్తె ఎమ్. దీపిక , కానిస్టేబుల్ తల్లి ఎమ్. కోంటమ్మ లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో  2000 బ్యాచ్ కు చెందిన   కర్నూలు ,  చిత్తూరు ఉమ్మడి  జిల్లాల పోలీసులు  పాల్గొన్నారు.

About Author