NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మూడేళ్లుగా 2 వేల నోటు ముద్రించడం లేదట !

1 min read

పల్లెవెలుగువెబ్ : పెద్ద నోట్ల రద్దు తర్వాత అమలులోకి తీసుకొచ్చిన రూ.2 వేల నోటును ప్రింట్ చేయట్లేదని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. గడిచిన మూడేళ్లలో 2 వేల నోటు ఒక్కటి కూడా ప్రింట్ చేయలేదని పేర్కొంది. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నలకు ఆర్బీఐ ఇచ్చిన వివరాలలో ఈ విషయాన్ని వెల్లడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కొత్తగా 2 వేల నోట్లు ప్రింట్ చేయలేదని తెలిపింది. కొంతకాలంగా రూ.2 వేల నోటు చలామణిలో కనిపించడంలేదు. ఏటీఎంలలో కూడా రూ.500 వందలు, రూ.200, రూ.100 నోట్లు మాత్రమే వస్తున్నాయి. మార్కెట్లో రూ.2 వేల నోటు కనిపించడమే అరుదైపోయిందని పలువురు దుకాణదారులు చెబుతున్నారు.

About Author