PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాధిత రైతు కుటుంబాలకు 21 లక్షల చెక్కు పంపిణీ 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  పంటలు సరిగా పండగ అప్పుల పాలై ఆత్మహత్యకు పాల్పడ్డ ముగ్గురు రైతు కుటుంబాలకు స్థానిక ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి 21 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ మేరకు గురువారం వెల్దుర్తి మండలం లోని చెరుకులపాడు గ్రామంలో బాధిత కుటుంబాలకు పత్తికొండ శాసనసభ్యురాలు  కంగాటి శ్రీదేవి  చేతుల మీదుగా  21 లక్షల రూపాయల మెగా చెక్ ను అందజేసారు.కొసనపల్లి గ్రామానికి చెందిన పెద్ద బోడన్న  వాసు దేవమ్మ W/O పెద్ద గోడన్నగారి లక్ష్మన్న కుటుంబానికి.పేరేముల గ్రామానికి చెందిన భోగ్యం సువర్ణ W/O భోగ్యం రాజేష్, అలాగేతెల్లగళ్ల కేశవయ్య S/oతెల్లగళ్ల దానమయ్య కుటుంబాలకు ఒక బాధిత కుటుంబానికి 7 లక్షల రూపాయల చొప్పున మొత్తం 21 లక్షల రూపాయల విలువ చేసే చెక్కును ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అందించారు.బాధిత రైతుల కుటుంబాలకు అండగా ఉంటామని గౌరవ ఎమ్మెల్యే ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.బాధిత రైతు కుటుంబాలను ఓదార్చి మంజూరు అయిన డబ్బుతో పిల్లలను బాగా చదివించుకొవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వం రైతుల సంక్షేమములో అన్నీ విధాల ఆదుకుంటుంది కావున  క్షణికావేశములో రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దు అని ఎమ్మెల్యే  కోరారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు తమని ఆదుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ప్రత్యేక చొరవ తీసుకొని త్వరగా మంజూరు చేయించిన  ఎమ్మెల్యే శ్రీదేవమ్మకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల వ్యవసాయ అధికారి మరియు పెరాముల గ్రామ సర్పంచ్, వైయస్సార్ పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు.

About Author