PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని 25 సంవత్సరాలు వృథా !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సవాలును మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే స్వీకరించారు. బీజేపీతో పొత్తు వల్ల శివసేన 25 సంవత్సరాలు వృథా అయ్యాయని అభిప్రాయపడ్డారు. మహారాష్ర్ట బయట కూడ శివసేనను విస్తరిస్తామని, జాతీయ స్థాయికి ఎదుగుతామని చెప్పారు. బీజేపీ ఎదుగుదలలో సేనలాంటి పలు ప్రాంతీయ పార్టీల సహకారం ఉందని, ఆసమయంలో చాలాచోట్ల బీజేపీకి కనీసం డిపాజిట్లు వచ్చేవికాదని గుర్తు చేశారు. హిందుత్వకు అధికారమివ్వాలనే బీజేపీతో పొత్తుపెట్టుకున్నామని, అంతేకానీ అధికారం కోసం తామెప్పుడూ హిందుత్వను వాడుకోలేదని ఉద్దవ్‌ చెప్పారు. బీజేపీ అనుకూలవాద హిందుత్వ చేస్తుందని ఆయన విమర్శించారు.

      

About Author