PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

28 మంది ఎంపీలు.. రాష్ట్రానికి ఏం సాధించారు ?

1 min read

పల్లెవెలుగువెబ్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రైతులు, పేదల కోసం ఏం చేస్తున్నారో చెప్పలేదన్నారు. వేతన జీవులకు మొండిచేయి చూపారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నదుల అనుసంధానంపై కేంద్ర ప్రణాళికలను స్వాగతిస్తున్నామన్నారు. డిజిటల్, సోలార్, ఎలక్ట్రికల్ వెహికల్‌రంగంలో సంస్కరణలు మంచి పరిణామని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్‌లో ఏపీ ప్రయోజనాలను సాధించడంలో మరోసారి వైసీపీ విఫలమైందని ఆయన ఆరోపించారు. 28 మంది వైసీపీ ఎంపీలు ఉండి.. ఏపీకి ఏం సాధించారని ప్రశ్నించారు.

        

About Author