NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

30 లీటర్ల నాటు సారాను స్వాదీనం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్, కర్నూలు వారి ఆదేశముల మేరకు కర్నూల్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్  మరియు వారి సిబ్బంది కాల్వ గ్రామం లో వెహికల్ చెక్ నిర్వహిస్తుండగా, వై.కే  తాండ కు చెందిన లౌడ్య నరేష్ నాయక్ ను సిబ్బంది పట్టుకొనేందుకు ప్రయత్నించగా బైక్, సారాయి వదిలి పారిపోయినాడు. బైక్ మరియు 30 లీటర్ల నాటు సారాను స్వాదీనము చేసుకొని,  సదరు పారిపోయిన మగ వ్యక్తి పై  కేసును నమోదు చేశాము అని త్వరలోనే పట్టుకుంటాము అని కర్నూల్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ కే.చంద్రహాస్ తెలిపారు. మరియొక్క కేసులో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ కే.చంద్రహాస్  మరియు సిబ్బంది, ఈఎస్​టీఎఫ్​  ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ మరియు వారి సిబ్బంది కలిసి మునగలపాడు గ్రామం నందు ధాడులు జరుపగా చెందిన  మధు కృష్ణ  అను వ్యక్తి  వద్ద  48 ఎన్​డిపిఎల్​ మద్యం బాటిల్స్  ను స్వాదీనము చేసుకొని,  సదరు వ్యక్తి ని  అదుపులోకి తీసుకొని కేసును నమోదు చేసినట్టు కర్నూల్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ కే.చంద్రహాస్ తెలిపారు. ఈ దాడులలో కర్నూల్ స్టేషన్  సబ్-ఇన్స్పెక్టర్ కె.నవీన్ బాబు మరియు సిబ్బంది మురహరి రాజు, చంద్ర పాల్, ఈరన్న మరియు మదు  పాల్గొన్నారు అని తెలిపినారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *