PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 31 వ వార్షికోత్సవం

1 min read

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు జిల్లా స్థానిక రామచంద్రరావు పేట శంకరమఠం రోడ్డు శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 31వ వార్షికోత్సవ సందర్భంగా గురువారం సాయిబాబా మందిరం ఆవరణలో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఏలూరు నగరంలోని ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ మందిరం అనునిత్యం భక్తులు భక్తిశ్రద్ధలతో బాబాను దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకొని స్వామివారి ఆశీస్సులు పొంది కృప కటాక్షాలు అందుకుంటుంటారు. ప్రతి గురువారం పెద్ద ఎత్తున భక్తులు బాబా ఆలయాన్ని సందర్శించి తీర్థ ప్రసాదాలు అందుకుంటుంటారు. భక్త బృందంచే భజనలతో హారతిలిచ్చి ఎంతో ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ కొలుస్తుంటారు. ప్రత్యేక కార్యక్రమాలలో పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహిస్తుంటారు, వార్షికోత్సవ సందర్భంగా ఉదయం సత్యనారాయణ స్వామి వ్రతాలు, మరియు సాయంత్రం శ్రీ సాయిబాబా కి పల్లకి సేవ కమిటీ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు, ఆలయాన్ని సుందరీకరణంగా పూలమాలలతో అలంకరించి. బాబా వారిని ప్రత్యేక అలంకారలతో తీర్చిదిద్దారు, కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి. మొక్కులు తీర్చుకొని శ్రీ బాబా కృపకు పాత్రులయ్యారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రోచ్ఛారణలతో హారతులు ఇచ్చి కొబ్బరికాయ కొట్టి పల్లకి సేవ ప్రారంభించారు.

About Author