PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

35 టేకు దుంగలు .. 5 సైకిళ్ళు స్వాధీనం

1 min read

* అడవి శాఖ అధికారుల అదుపులో ఆరుగురు ముద్దాయిలు

పల్లె వెలుగు, రుద్రవరం: కర్నూలు జిల్లా రుద్రవరం అటవీ రేంజ్ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో గల నూతల సౌత్ బీట్ లో 35 టేకు దుంగలు 5 సైకిళ్ళు స్వాధీనం చేసుకుని ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు తెలిపారు. నర్సాపురం గ్రామానికి చెందిన గుర్రం ప్రభుదాసు, కొత్తమాసి కుమార్, గుర్రం దానం, గుర్రం రాముడు, చిట్టిగాళ్ళ ఓబులేసు, ఆవుల ఓబులేసు అనే వ్యక్తులు నల్లమల ప్రాంతంలోని నూతల సౌత్ బీట్ లోకి అక్రమంగా ప్రవేశించి టేకు దుంగలు నరికి సైకిళ్లపై తరలించేందుకు సిద్ధం చేస్తుండగా సిబ్బంది వెళ్లి దాడి చేసి టేకు దుంగలు సైకిళ్లను స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి ఆళ్లగడ్డ కోర్టులో హాజరుపర్చగా మెజిస్ట్రేట్ రిమాండ్ కు తరలించడం జరిగింది అన్నారు. ఈ దాడిలో అహోబిలం డిఆర్ఓ రవీంద్ర నాయక్, సెక్షన్ అధికారి రాణెమ్మ, అసిస్టెంట్ బీట్ అధికారులు రామకృష్ణ మద్దిలేటి పాల్గొన్నారు.

About Author