PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

4 కోట్ల మందికి ఉద్యోగాలు లేవు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: దేశంలో పేదరికం, నిరుద్యోగం, పెరుగుతున్న ఆర్థిక అసమానతలు వంటి సమస్యలు పట్టి పీడిస్తున్నాయని ఆరెస్సెస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో 4 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారన్నారు. పారిశ్రామిక రంగానికి అనువైన వాతావరణం కల్పిస్తే ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్న యువత ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదుగుతారని సూచించారు. భారత్‌ జోడో యాత్రలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక అసమానతలు వంటి సమస్యలను ప్రస్తావించిన సమయంలోనే ఆరెస్సెస్‌ నేత ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఆదివారం ఢిల్లీలో ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ స్వావలంబి భారత్‌ అభియాన్‌లో భాగంగా నిర్వహించిన వెబ్‌నార్‌లో ఆయన ప్రసంగించారు.

                                                      

About Author