PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా తెలుగుదేశం పార్టీ 42 వ ఆవిర్భావ దినోత్సవం

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నందికొట్కూరు పట్టణం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంచార్జి మాండ్ర శివానంద రెడ్డి ,నందికొట్కూరు టీడీపీ అభ్యర్థి గిత్త జయసూర్య  ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ జండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర. ఇది కేవలం అధికారం కోసం ఆవిర్భవించిన పార్టీ కాదని తెలుగునాట అతిపెద్ద సామాజిక విప్లవానికి నాంది పలికిందన్నారు నాలుగు గోడల మధ్యకే పరిమితం అయిన రాజకీయం తెలుగుదేశం ఆవిర్భావంతో సామాన్యుని ముంగిటకు చేరిందని మదారాసీ పరదాల మాటున మగ్గిపోతున్న తెలుగుజాతి ఔన్నత్యానికి ఎన్టీఆర్ వెలుగును ప్రసాదించారన్నారు . చంద్రబాబు హయాంలో ఆ వెలుగు విశ్వవ్యాప్తం అయిందని నారా లోకేష్ ఆ వెలుగు మసకబారకుండా మరింతగా వన్నె తెస్తున్నారని. దేశంలోనే తెలుగుదేశం పార్టీ కి ఒక ప్రత్యేకత ఉన్నదని దేశ రాజకీయ యవనికపై దశాబ్దాలుగా ప్రస్థానం సాగిస్తున్న అతికొద్ది ప్రాంతీయ పార్టీలలో తెలుగుదేశం ముందువరుసలో ఉందన్నారు వర్తమాన రాజకీయాలలో తెలుగుదేశం పార్టీకి ఎదురైనన్ని సవాళ్లు మరే ఇతర పార్టీకి ఎదురుకాలేదని ఎన్నో సవాళ్లు, ప్రతికూల పరిస్థితులకు తట్టుకొని మనుగడ సాగించడం తెలుగుదేశం పార్టీకే చెల్లిందన్నారు అందుకు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వేసిన పునాది, చంద్రబాబు దానిని పటిష్టం చేసిన వైనం అందుకు ప్రధాన కారణం అన్నారు తెలుగునేలపై అతిపెద్ద సైన్యం తెలుగుదేశం పార్టీ సొంతం అన్నారు వర్తమాన రాజకీయాల్లో పూటకొక పార్టీ మారుతున్న నాయకులు మనకు తారస పడుతున్నారని అయితే గత 42 సంవత్సరాలుగా రాజకీయ ఒడిదుడుకులు, వత్తిళ్లు, ప్రలోభాలు, బెదిరింపులు కు లొంగకుండా ఓకే పార్టీ లో రాజకీయ ప్రస్థానం సాగిస్తున్న నాయకులు టిడిపిలో పదుల సంఖ్యలో ఉన్నారన్నారు . ఈ అరుదైన ఘనత మరే ఇతర ప్రాంతీయ పార్టీలోనూ కానరాదన్నారు. అంతేగాక క్షేత్ర స్థాయిలోనూ నాలుగు దశాబ్దాలుగా ఏ విధమైన పదవులు ఆశించకుండా పార్టీ పతాకం మోస్తున్న కార్యకర్తలు తెలుగునేల నలుచెరగులా ఉన్నారని . కుల, మత,లింగ భేదాలకు అతీతంగా వున్న కార్యకర్తల శ్రేణి టిడిపికి రక్షాకవచంగా ఉందన్నారు.  టిడిపికి చంద్రబాబు వంటి నాయకుడు తరగని ఆస్తి అని చంద్రబాబు నాయకత్వంలో సుశిక్షితుడైన సైనికుని తరహాలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ శ్రేణులలో పోరాట స్ఫూర్తి నింపుతున్నారని ఈ విధంగా తెలుగుజాతి చరిత్రపై చెరగని పచ్చబొట్టు లా తెలుగుదేశం పార్టీ నిలిచిందన్నారు. నేడు నాలుగు దశాబ్దాల ప్రస్థానాన్ని విజయవంతంగా ముగించుకొని 43 వ ఏట అడుగు పెట్టిందన్నారు . అలాగే 2024 మే లో జరిగే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి అఖండ మెజారిటీని తీసుకుని వచ్చి నందికొట్కూరు ఎమ్మెల్యేగా జయసూర్య భారీ స్థాయిలో గెలిపించుకొని చంద్రబాబు కు  బహుమతిగా ఇవ్వాలని మాండ్ర తెలియజేశారు . ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author