NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

44 మంది మావోల లొంగుబాటు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : చ‌త్తీస్ఘ‌డ్ లో 44 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 9 మంది మ‌హిళ‌లు కూడ ఉన్నారు. కొత్త‌గా ఏర్పాటు చేసిన క్యాంపు క‌రిగుండం వ‌ద్ద లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఓ నక్సలైట్ పై ప్రభుత్వం రూ.2లక్షల రివార్డును ప్రకటించింది. కొంతమంది కారిగుండం గ్రామ పరిసర ప్రాంతాల చెందిన కొత్తవారు ఉన్నారు. లొంగిపోయిన నక్సలైట్లకు, వారితో పాటు వచ్చిన గ్రామస్తులకు పోలీసులు ఆహారం అందించారు. లొంగిపోయిన నక్సలైట్లందరికీ ప్రభుత్వం పునరావాస పథకాల ప్రయోజనం అందజేస్తుందని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్‌రాజ్ మీడియాకు తెలిపారు.

                                                       

About Author