PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

49బన్నూరు-మాసపేట రహదారి వేయండి మహా ప్రభో..

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని 49 బన్నూరు-మాసపేట పాత రోడ్డును వేయించాలని ఇరు గ్రామాల రైతులు కోరుతున్నారు.ఈ రోడ్డు వైపునకు రెండు గ్రామాల్లో ఉన్న రైతుల పొలాలు ఎక్కువగానే ఉన్నాయి.గత 15 సంవత్సరాల క్రితం వరకు ఈ రోడ్డు మార్గం మీదనే ఆర్టిసి బస్సు మరియు వాహనాలు ఈ రోడ్డు గుంతల మయంగా ఉన్నా కూడా బస్సు ఈ దారిలోనే వెళ్తూ ఉండేవి. అప్పటి నుంచి ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి.కానీ ఈ రహదారికి మాత్రం మోక్షం రాదా అంటూ రైతులు అంటున్నారు.రైతుల ఎద్దుల బండ్లు మరియు ద్విచక్ర వాహనాలు,ఆటోలు వెళ్లాలంటే రోడ్డు గుంతలు గుంతలుగా ఏర్పడడం మరియు రోడ్డుకు ఇరువైపులా ముళ్ళ చెట్లు రోడ్డుమీదికి రావడం పట్ల మేము తీసుకువచ్చే పంటను ఇండ్లకు తీసుకురావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామని ఎక్కడ ఏమి జరుగుతుందో ననే భయం నెల కొని ఉందని రైతులు ఆవేదనను వెళ్లగక్కు తున్నారు.ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు దీనిపై దృష్టి సారించి రోడ్డును వేయించాలని రైతులు కోరుతున్నారు.

About Author