PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

49 బన్నూరులో.. గుండెపోటుతో వ్యక్తి మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని 49 బన్నూరు గ్రామంలో గుండెపోటుతో వ్యక్తి మృతి చెందిన సంఘటన జరిగింది.గ్రామానికి చెందిన చెవుల రాజగోపాల్ (55) గుండెపోటుతో మృతి చెందారు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మంగళవారం ఉదయం ఆయన సొంత పనుల నిమిత్తం కర్నూలులో ఉంటున్న వారి బంధువుల ఇంటికి వెళ్లాడు.మధ్యాహ్నం వారి బంధువుల ఇంటిలో గుండెపోటు రావడంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు.అక్కడ వైద్యులు చికిత్స చేస్తూ ఉండగా ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య చెవుల నిర్మలమ్మ,అనిత,అశోక్,కార్తీక్,అఖిల సంతానం ఉన్నారు.ముగ్గురు పిల్లలు చదువుతున్నారు.కుటుంబ యజమాని మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు మరియు బంధువులు కన్నీటి సంద్రంలో మునిగారు. ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి సదుపాయాలు ఈ కుటుంబానికి వచ్చే విధంగా చూడాలని కాలనీవాసులు కోరుతున్నారు.

About Author