PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళ గర్భాశయంలో 5.5 కేజీల కణితి తొలగింపు

1 min read

– శస్త్ర చికిత్స ద్వారా తొలగించిన అమీలియో హాస్పిటల్ డాక్టర్ శివప్రసాద్
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: ఓ మహిళ కడుపులో నుంచి 5.5 కిలోల కణితిని తొలగించారు అమిలియో హాస్పిటల్​ వైద్యులు డా. శివ ప్రసాద్​. తుగ్గలి మండలం గిరిగెట్టా గ్రామానికి చెందిన సోల సుంకమ్మ (48) కొన్నాళ్లుగా కడుపునొప్పితో బాధపడుతూ ఉంది. వైద్య చికిత్స కోసం కుటుంబ సభ్యులు నగరంలోని అమిలియో ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె కడుపులో కణితి ఉన్నట్టు గుర్తించిన డాక్టర్ శివప్రసాద్ .. శస్త్ర చికితత్స ద్వారా కణితిని తొలగించారు. ఇలాంటి కేసులు చాల అరుదుగా నమోదవుతుంటాయని అమిలియో హాస్పిటల్ లో అత్యంత సాంకేతికతతో శస్త్ర చికిత్స ద్వారా కణితిని తొలగించామని డా. శివప్రసాద్​ వెల్లడించారు. కొన్నాళ్లుగా పడుతున్న ఇబ్బంది తొలగిపోవడంతో బాధితురాలు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.


About Author