PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లాన్స్ నాయ‌క్ సాయితేజ కుటుంబానికి 50 ల‌క్షల ఆర్థిక సాయం

1 min read

పల్లెవెలుగు వెబ్​: ఇటీవ‌ల త‌మిళ‌నాడులోని కున్నూరు వ‌ద్ద జ‌రిగిన ఆర్మీ హెలీకాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావ‌త్ తోపాటు మృతి చెందిన సాయితేజ్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ఆర్థిక స‌హాయం అందించింది. సాయితేజ కుటుంబానికి డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి 50 ల‌క్షల ఆర్థిక స‌హాయ‌న్ని రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున అందించారు. కలెక్టర్‌ హరినారాయణన్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డితో కలిసి చిత్తూరు జిల్లా కురబలకోట మండలం రేగడవారిపల్లె వచ్చారు. సాయితేజ భార్య శ్యామల, తల్లిదండ్రులు భువనేశ్వరి, మోహన్ ల‌ను పరామర్శించారు.

About Author