PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

50 ట్రాక్టర్ల గడ్డివాము అగ్నికి ఆహుతి

1 min read
నిర్వాహకులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్​ రెడ్డి

నిర్వాహకులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్​ రెడ్డి

కన్నీరుమున్నీరైన నిర్వాహకులు
పల్లెవెలుగువెబ్​, కల్లూరు అర్బన్ : పాణ్యం నియోజకవర్గ పరిధిలోని, కల్లూరు అర్బన్ 28 వ వార్డులోని నేషనల్ హైవే 44 లోని రాగమయూరి ఎదురుగా గాయత్రి గోశాల నందు ఉన్న దాదాపు 50 ట్రాక్టర్ ల గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వెంటనే గాయత్రి గోశాలను సందర్శించి అగ్ని ప్రమాదం ఎలా జరిగింది.. ఎంత నష్టం .. అన్న విషయాన్ని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. 28 వ వార్డు కార్పొరేటర్ నారాయణ రెడ్డి ,29 వ వార్డ్ కార్పొరేటర్ సుదర్శన్ రెడ్డి పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్యెల్యే వెంట ఉన్నారు.

About Author