PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా 5 కే రన్

1 min read

– ప్రారంభించిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  నగరంలోని ఎన్ ఆర్ పేటలో ఉన్న భాష్యం ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆధ్వర్యంలో జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన 5కే రన్ ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు .ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం రాజ్యసభ మాజీ సభ్యులు డీజీ వెంకటేష్ కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రతి ఒక్కరూ రాజ్యాంగంపై సంపూర్ణమైన అవగాహన కలిగించుకొని రాజ్యాంగం ప్రకారం వచ్చే హక్కులను పొందాలని సూచించారు. మనదేశంలో రాజ్యాంగం వేదాలు సంస్కృతి ఉన్నప్పటి నుంచి ఉందని అప్పట్లో దేవుడి పేరు చెప్పి ఎవరైనా తప్పు చేస్తే శిక్ష పడుతుంది అని పద్ధతిగా జీవించేలా చేసే వారిని చెప్పారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత అన్నిటినీ క్రోడీకరించి భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రూపొందించారని చెప్పారు. భారత రాజ్యాంగంలో హక్కులతో పాటు పౌరుల బాధ్యతలను కూడా ముందు పరిచారని వివరించారు. విద్యార్థులు విద్యార్థి దశ నుంచి రాజ్యాంగంపై సమగ్రమైన అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేశును పాఠశాల యాజమాన్యం తరఫున ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాష్యం విద్యాసంస్థల జోనల్ ఇంచార్జ్ అనిల్ కుమార్ ప్రిన్సిపాల్ లో శ్రావణ్ కుమార్, రాంప్రసాద్, మధు ,కుసుమ లతోపాటు పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Author