NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వేర్వేరు ఘటనలో 6 గడ్డివాములు దగ్ధం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: వాచావు రూ.4.50 లక్షల ఆస్తి నష్టం -హొళగుంద, ముద్దటమాగిలో ఘటన  ముద్దటమాగిలో దగ్గమవుతున్న గడ్డివాములు  పాకెన్తో మంటలను అదువు చేసే ప్రయత్నం చేస్తున్న దృశ్య 1210: హొళగుందలో కాలిపోతున్న గడ్డివాములుమంటలను ఆర్కెందుకు ప్రయత్నిస్తున్న స్థానికులుహొళగుంద మండలంలో హొళగుంద, ముద్దటమాగి గ్రామాలలో గురువారం ప్రమాదవషత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో 6 గడ్డివాములు కాలి బూడిదైయ్యాయి. దాదావు రూ.4.50 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. ముద్దటమాగి గ్రామ శివారులో రైతు కురువ ఈరన్న వేనుకున్న రెండు గడ్డివాములు, ఒక జొన్న సోప్ప వాము వక్కనే వేసిన పెంటదిబ్బ నుంచి మంటలు వ్యాపించి కాలిపోయాయి. ఇంట్లో వంట తర్వాత పెంటదిబ్బలో వేసిన బూది నుంచి ఈ మంటలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. అదేవిధంగ హొళగుంద దిద్ది కాలనిలోని చెరువు గట్టు వద్ద కూడూరు రఫీక్ వేసుకున్న రెండు గడ్డివాములు, ముల్లా అబ్దుల్లాకు చెందిన ఒక గడ్డివాముకు ప్రమాదవషత్తు మంటలు అంటుకుని కాలిపోయాయి. వెంటనే స్థానికులు చుట్టూ ఉన్న మరో 35 గడ్డివాములకు మంటలు వ్యాపించకుండ పూర్తిగ ఆర్చే ప్రయత్నం చేశారు. అంతకు ముందు ఆలూరు ఫైర్ స్టేషన్లకు కూడా సమాచారం ఇవ్వడం వల్ల ఫైర్ ఇంజెన్ అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అలాగే ముద్దదిమాగి సంఘటన తెలుసుకుని అక్కడికి కూడా వెళ్లి మంటలను అదుపు చేశారు. విఆర్లు ఆయా గ్రామాలకు చేరుకుని ఆస్తి నష్టం పై అంచన వేసి నివేదికను పై అధికారులకు పంపించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

About Author