PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

600 మంది ఐఐఐటీ విద్యార్థుల‌కు అస్వ‌స్థ‌త !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బాస‌ర ఐఐఐటీ విద్యార్థులు మధ్యాహ్నం భోజనం తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులతో 600 మంది అస్వస్థులయ్యారు. యూనివర్సిటీ మెస్‌లో శుక్రవారం మధ్యాహ్నం సుమారు 3 వేల మంది విద్యార్థులు భోజనం చేశారు. తర్వాత హాస్టళ్లకు వెళ్లిన వీరిలో ఒక్కొక్కరుగా ఇబ్బందిని ఎదుర్కొన్నారు. దీంతో అధ్యాపకులు తమ కార్లలో వర్సిటీలోని ఆస్పత్రికి తరలించారు. 9 మంది విద్యార్థులకు నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అస్వస్థులైన మరో వందమందిలో కొందరిని నిజామాబాద్‌, నవీపేటలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో, ఇంకొందరిని ట్రిపుల్‌ ఐటీలోని ఆస్పత్రిలో చేర్చారు. దాదాపు 400-500 మంది స్వల్ప అనారోగ్యానికి గురికాగా, చికిత్స అనంతరం హాస్టళ్లకు పంపించేశారు. ఆహారం, తాగునీరు కలుషితం కావడమే ఈ ఘటనకు కారణమని అధికారులు అనుమానిస్తున్నారు.

                                                       

About Author