67.27 లక్షల మందికి తల్లికి వందనం
1 min read
తల్లికి వందనంపై బ్లూ మీడియా విషం చిమ్ముతుంది
మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి
మంత్రాలయం , న్యూస్ నేడు : జగన్ ప్రభుత్వం లో అమ్మ ఒడి పథకం కింద 42 లక్షల మంది విద్యార్థులకు ఇచ్చేదని కూటమి ప్రభుత్వం 67. 72 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం కింద ఇంట్లో ఎంత మంది ఉన్నా అందరికీ రూ 15 వేలు ఇస్తుంటే వైకాపా నేతలు మాత్రం విషం చిమ్ముతున్నారని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని మాధవరం గ్రామంలో తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైసిపి పాలనలో 13,000 ఇచ్చారు అంటే 2000 జగన్ జేబులోకి పోయాయా లేదా తాడేపల్లి ప్యాలెస్ కు చేరాయా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చాక ప్రతి కుటుంబంలో ఒకే ఒక విద్యార్థికే 13 వేల రూపాయలు ఇస్తామంటూ నాలుక మడత పెట్టింది జగన్ రెడ్డి నువ్వు కాదా అన్నారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి లబ్ధి చేకూరుస్తుంటే బెంగుళూరులో కూర్చొని జగన్ రెడ్డి విష ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు. ఈ పథకం కోసం వైసీపీ రూ 5000 కోట్లు ఖర్చు పెడితే కూటమి ప్రభుత్వం రూ 10000 కోట్లు మేర ఖర్చు చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిందన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు సంతోషంగా ఉంటే జగన్ రెడ్డి అండ్ కో మాత్రం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు అక్కమ్మ తోట రామకృష్ణ, గోపాల్ రెడ్డి,విరేష్ గౌడ్,కాత్రికి చంద్ర, కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.