NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

68 అక్రమ బియ్యం ప్యాకెట్ల పట్టివేత

1 min read

పల్లెవెలుగు వెబ్  మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల మండల కేంద్రంలోని నందికొట్కూరు నంద్యాల ప్రధాన రహదారిలో బ్రహ్మంగారి మఠం దగ్గర సోమవారం ఉదయం వాహన తనిఖీల్లో భాగంగా వెళ్తున్న బొలెరో వాహనంలో ఉన్న 68 ప్యాకెట్ల బియ్యం ప్యాకెట్లను పోలీసులు గుర్తించారు.ఎస్ఐ ఎం.జగన్ మోహన్ తెలిపిన వివరాల మేరకు ఆత్మకూరు చుట్టుపక్క గ్రామాలలో ప్రజలనుంచి పిడిఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి బొలేరో(ఏపీ 39 వై 3455) వాహనంలో బియ్యాన్ని తరలిస్తుండగా వాహన డ్రైవర్ ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామానికి చెందిన సద్దాం హుస్సేన్ ను మరియు బియ్యం సంచులను వాహనంలోకి వేసిన ముగ్గురు వ్యక్తులపై అదేవిధంగా కర్నూలుకు చెందిన మురళి అను వీరి పైన కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు.నేను రోజూ పని చేసుకుంటూ జీవనం చేసే వాడినని రోజుకు వెయ్యి రూపాయలు కూలీ వస్తుందన్న ఆశతో వాహనానికి డ్రైవర్ గా వచ్చానని సద్దాం హుస్సేన్ ఎస్ఐకి వివరించారు.

About Author