NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పశుగ్రాసం దగ్ధం..రూ.70 వేల ఆస్తి నష్టం

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  నందికొట్కూరు పట్టణంలోని ఓ రైతుకు చెందిన పశుగ్రాసం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడడంతో  దగ్ధమైన ఘటన మంగళవారం నందికొట్కూరు లో చోటుచేసుకుంది. పట్టణంలోని బైరెడ్డి నగర్ కు చెందిన కుమ్మరి శివుడు పశువుల కోసం దాదాపు ఐదు ట్రాక్టర్ల వరి గడ్డిని కొనుగోలు చేసి గడ్డివాముగా వేసుకున్నాడు. మధ్యాహ్నం ఎవరు లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గడ్డివాముకు నిప్పంటించారు. మంటలు ఎగిసి పడటంతో చుట్టూ పక్కల వారు గమనించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్ సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసింది. పశువుల కోసం కొనుగోలు చేసిన పశుగ్రాసం కాళీ బూడిద కావడంతో ఆ రైతు తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. దాదాపు రూ.70 వేల రూపాయలు ఆస్తి నష్టం వాటిలినట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులు స్పందించి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

About Author