PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

981 ప‌ద‌వుల్లో 742 ఆ సామాజిక వ‌ర్గానికే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్రభుత్వ నామినేటెడ్‌ పదవుల్లో ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేశారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శించారు. ఈ అంశంపై సామాజిక న్యాయ భేరి పేరిట బస్సు యాత్ర చేసిన మంత్రులతో తాను చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. జగన్‌ ప్రభుత్వం 981 నామినేటెడ్‌ పదవుల నియామకం చేపడితే, అందులో 742 మంది రెడ్లకే ఆ పదవులను కట్టబెట్టారని రఘురామ వివరించారు. రాష్ట్రంలో 12 వైస్‌ ఛాన్సలర్‌ పదవులలో పదిమంది సీఎం సామాజికవర్గానికి చెందిన వారినే నియమించారని తెలిపారు. ఇక ప్రభుత్వ సలహాదారులుగా 42 మందిని నియమించుకున్న ముఖ్యమంత్రి అందులో 35 పోస్టులను తన సామాజికవర్గానికి చెందిన వారికే ఇచ్చుకున్నారని రఘురామ తెలిపారు.

                                     

About Author